Category: తెలంగాణ | 25 May 2025, 01:16 PM
ప్రభుత్వ భూములకు ప్రత్యేక పోర్టల్
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
స్పైడర్, హైదరాబాద్ : ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసిందన్నారు. నిషేధిత ఆస్తుల వివరాలను ఆ పోర్టల్లో పెట్టడం జరుగుతుందన్నారు. ఒకవేళ నిషేధిత భూమిని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తే, వెంటనే హైదరాబాద్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయానికి ఆన్లైన్లో సమాచారం చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విధానం ద్వారా నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లను పరిరక్షించేందుకు మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుందని, అలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై చర్యలు తీసుకునేందుకు దోహదం చేస్తుందన్నారు.