Category: రాజకీయం | 24 May 2025, 09:02 PM
చట్టసభల్లో యాదవుల ప్రాతినిథ్యం పెరగాలి
కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
ఘనంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందన సభ
అపూర్వ స్వాగతం పలికిన గొల్ల కురుమలు
వరంగల్ నగరంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించిన గొల్లకురుమలు
నెల్లికంటి సత్యం కు అవకాశం కల్పించినందుకు సీపీఐ కి కృతజ్ఞతలు తెలిపిన యాదవ వెల్ఫేర్ ట్రస్టు నాయకులు
స్పైడర్, వరంగల్ : అత్యధిక జనాభా ఉన్న యాదవులకు చట్ట సభల్లోనూ ప్రాతినిథ్యం పెరగాలని కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆకాక్షించారు. ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యంకు అవకాశమిచ్చినందుకు సీపీఐ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హనమకొండలోని హరిత హోటల్ లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మునుగోడు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి, అనేక కష్టనష్టాలకు ఓర్చి సీపీఐ పార్టీలో అంచలంచలుగా ఎదిగి ఎమ్మెల్సీ కావడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ సత్యం ఎమ్మెల్సీగా ఎదిగిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అశోక్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవీందర్ యాదవ్, రిటైర్డ్ ఎంపీడీవో సాయి చరణ్ యాదవ్,అఖిల భారత యాదవ మహాసభ నాయకులు గీరబోయిన రాజయ్య యాదవ్, కంచె కుమారస్వామి యాదవ్, మదం రజని కుమార్ యాదవ్, యాకయ్య యాదవ్,ప్రశాంత్ యాదవ్, తిరుపతి యాదవ్,కిషోర్ యాదవ్, సిద్దిరాజు యాదవ్, జక్కు రమేష్ యాదవ్, సంపత్ యాదవ్, ముంత రాజయ్య యాదవ్, ఎడ్ల వేణు యాదవ్, సంపత్ యాదవ్, మల్లయ్య యాదవ్, శంకర్రావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.