ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

మంత్రులు ఫైళ్ల క్లియ‌రెన్స్‌కు డ‌బ్బులు తీసుకుంటారు.. మ‌రోసారి మంత్రి సురేఖ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
Share this post

Category: రాజ‌కీయం | 16 May 2025, 11:53 AM

మంత్రులు ఫైళ్ల క్లియ‌రెన్స్‌కు డ‌బ్బులు తీసుకుంటారు..
మ‌రోసారి మంత్రి సురేఖ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

స్పైడ‌ర్‌, వ‌రంగ‌ల్ : అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఫైళ్ల క్లియ‌రెన్స్‌కు మంత్రులు డ‌బ్బులు తీసుకుంటార‌ని, అయితే తాను మాత్రం అలా చేయ‌న‌ని చెప్పుకు రావ‌డం గ‌మ‌నార్హం. గురువారం ఓ క‌ళాశాల‌లో చేప‌డుతున్న అభివృద్ధి పనుల్లో చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టాయి. సోష‌ల్ మీడియాలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్‌ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం ఆమె మాట్లాడారు. మంత్రి ఏం మాట్లాడిందో ఆమె వ్యాఖ్య‌ల్లోనే.. ‘‘ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాతది కూలగొట్టి, కొత్త భవనం కట్టాలని కలెక్టర్‌ కూడా నా దృష్టికి తెచ్చారు. ఇందుకు రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో దారీతెన్ను తెలియలేదు. మరి నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి.. నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్‌ కోసం వస్తాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్‌ చేస్తారు. అప్పుడు వాళ్లతో నేను అన్నా.. మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్‌ ఒకటి డెవలప్‌ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు.. పై వాళ్లతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకు చెందిన సదానంద రెడ్డి చెప్పారు. చివరకు సీఎ్‌సఆర్‌ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది’’ అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో గ్రౌండ్‌, రెండంతస్థులతో 15 తరగతి గదులు, ఆడిటోరియం తరహాలో పెద్ద హాల్‌, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్నిచర్‌ విద్యార్థినులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.

Related Posts

 చట్టసభల్లో యాదవుల ప్రాతినిథ్యం పెరగాలి .... కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
చట్టసభల్లో యాదవుల ప్రాతినిథ్యం పెరగాలి .... కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
Read More
ఆ లేఖ క‌విత రాసిందేనా..?! క‌విత మౌనం దేనికి సంకేతం..!
ఆ లేఖ క‌విత రాసిందేనా..?! క‌విత మౌనం దేనికి సంకేతం..!
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.