Category: రాజకీయం | 22 May 2025, 08:40 PM
ఆ లేఖ కవిత రాసిందేనా..?! కవిత మౌనం దేనికి సంకేతం..!
స్పైడర్, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓ లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్లుగా.. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతున్నట్లుగా ఈ లేఖలోని అంశాలుండటం గమనార్హం. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలనుఈ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై..ఆ తర్వాత పరిణామాలను కేసీఆర్కు రాసిన లేఖకు కవిత ప్రస్తావించారు. పాజిటీవ్,నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ లేఖలో ఏముందంటే..
మై డియర్ డాడీ..!! 'బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేజన్లపై విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాలుగా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వడం లేదు. బీజేపీతో పొత్తుపై సిల్వర్ జూబ్లీ వేడుకల్లో క్లారిటీ ఇవ్వలేదు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేది. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. పాత ఇన్ఛార్జ్లకే బీ ఫారమ్ ఇస్తారా?. బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డా. బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది' అని కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.