ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

గొర్రెల స్కాంలో ఏసీబీ ద‌ర్యాప్తు ముమ్మ‌రం.. మొయినుద్దీన్ ఇంట్లో ఇటీవ‌ల సోదాలు
Share this post

Category: తెలంగాణ‌ | 03 May 2025, 11:50 AM

స్పైడ‌ర్‌, హైద‌రాబాద్ : గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక నిందితుడు ఖాజా మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది ఉన్న‌తాధికారుల పేర్ల‌తో పాటు నాటి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లోనే గొర్రెల స్కాంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం క్ర‌మంగా ద‌ర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. మొత్తంగా రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని, ఈ స్కామ్‌లో ప్రధా న నిందితుడిగా మెయినుద్దీన్. కాగా, మెయినుద్దీన్, అతని కుమారుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన ని ధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా.. అధికారుల అమ్యామాల అంశం ముడిపడి ఉండటంతో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఇదీ జ‌రిగింది...
పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్దిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. అమ్మ‌కం దారుల‌కు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని రూ.2.1కోట్లను మళ్లించినట్లు అధికారుల ద‌ర్యాప్తులో తేలింది. సంబంధిత నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ అధికారులు ఇప్పుడు స‌మ‌గ్ర‌మైన ద‌ర్యాప్తున‌కు పూనుకున్నారు. బినామీ ఖాతాదారులను విచారిం చగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన మొయిను ద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసేలోగానే అతడు దుబాయ్‌కు ఉడాయించాడు. అనంతర కాలంలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని అధికారులు గుర్తించారు.’

2015లో పథకం ప్రారంభం
2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్దిదారులకు దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పథకంలో మొదట్నించీ అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో ఈ పాటికే వెల్లడైంది. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులో చూపించి, ఆ నిధుల్ని ఈ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాదాపు రూ.700 కోట్ల ఈ స్కామ్‌కు సంబంధించి ప్రధాన నిందితుడైన మొయినుద్దీన్ ఇంట్లో తాజాగా సోదాలు నిర్వహించింది. మరోవైపు ఈ కేసులో మొయినుద్దీన్ చిక్కితే పూర్తి చిక్కుముడులు వీడే అవకాశం ఉంది.

Related Posts

టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
Read More
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
Read More
బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.