Category: తెలంగాణ | 02 May 2025, 03:45 PM
స్పైడర్, హైదరాబాద్ : కుల గణనలో కేంద్రానికి తెలంగాణనే రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం రాజ్భవన్లో ఎమ్మెల్సీ విజయశాంతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కలిశారు. బీసీ బిల్లును రాష్ట్ర పతి పరిశీలనకు పంపినందుకు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని మాట ఇచ్చిందని, ఆ మాట ప్రకారం రాష్ట్రంలో కులగణనను పూర్తి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుల గణనతో కేంద్రంపై దేశ వ్యాప్తంగా ఒత్తిడి పెరిగిందన్నారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కుల గణన ఆదేశాల వెనుక కాంగ్రెస్ పార్టీ కృషి ఉందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం అన్నారు.