Category: జాతీయం | 09 May 2025, 10:12 PM
స్పైడర్, జమ్ము : భారత్ను నేరుగా ఎదుర్కోలేక... పాకిస్థాన్ భారత భూభాగంలోని సామాన్యుల ఇళ్లపై గురి పెడుతోంది. అందులో భాగంగానే భారత సరిహద్దులోని పాక్ భూ భాగం నుంచి డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా జమ్ములో వందల సంఖ్యలో డ్రోన్లను పాక్ భారత్లోకి వదులుతోంది. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్న భారత సైన్యం వాటిని వెంటవెంటనే కూల్చివేస్తోంది. జమ్ము కాశ్మీర్లో బాంబుల మోత మోగుతోందంటూ ఓమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.