Category: జాతీయం | 09 May 2025, 09:04 PM
స్పైడర్, న్యూఢిల్లీ : పాక్లోని ఉగ్రవాదం పీచమణచడానికి యుద్ధం ఆరంభించిన భారత్కు ప్రపంచదేశాల ప్రజల నుంచి దేశాధినేతల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రపంచం ముందు పాక్ ప్రభుత్వం ఇప్పుడు దోషిలాగా నిలబడుతోంది. అసలేం దినదిన గండం అన్న చందంగా మారిన పాక్ ఆర్థిక వ్యవస్థకు.. ఇప్పుడు భారత్తో యుద్ధంలో తలబడాల్సి రావడం పెద్ద గుదిబండగా మారిందనే చెప్పాలి. భారత్తో తలబడేందుకు పాక్ సైన్యం కూడా వెనకడుగు వేస్తోంది. ఉగ్రవాద మూకల్ని ముందుకు తీస్తోంది. జమ్ములో అక్రమంగా ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు కుట్ర పన్నుతోంది. అయితే ఎల్ వోసి వద్ద భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా ఉండటంతో పాక్ పప్పులు ఉండకడం లేదు. ఎక్కడికక్కడే బీఎస్ ఎఫ్, వాయు సేనలను వారిని తరిమి కొట్టడంతో పాటు ముందుకు వస్తున్న మూకల్ని మట్టుబెటుటోంది. సాంబ సెక్టార్లో ఏడుగురు ఉగ్రవాదులు భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తుండగా భారత జవాన్లు హతమార్చారు. భారత్ సైన్యం చూపుతున్న తెగువ, నైపుణ్యం, బలప్రదర్శనకు పాక్ సైన్యం తోకముడిచింది. ఇదిలా ఉండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచదేశాల మద్దతు లభిస్తోంది.2014 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. విదేశాంగ విధానంలో భారీ మార్పునకు పునాదులు వేసింది. దాని ఫలితమే నేడు భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక శక్తి కలిగిన దేశాలన్ని భారత్ చేస్తున్న మంచిని.. న్యాయమైన యుద్ధానికి మద్దతు తెలపలేకుండా ఉండలేకపోతున్నాయి. మోదీ లాంటి లీడర్ మాకుంటే ఉండే బాగుండు అంటూ ఎన్నో దేశాల ప్రజలు కోరుకుంటున్నారంటే.. మోదీ చరిష్మా, రాజనీతి, పాలన దక్షత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ లీడర్గా గుర్తింపు పొందిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావిశీలుర నాయకుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం.