Category: తాజా వార్తలు | 29 May 2025, 10:33 AM
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
స్పైడర్, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్ట్రాల్లో భారీ వర్ష సూచన కనిపిస్తోంది. రానున్న 48గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లోని యంత్రాంగాన్ని ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాహక జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది. ఆ క్రమంలో గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తగిన విధంగా సూచనలు జారీ చేసినట్లు చెప్పింది.