Category: క్రైం | 25 May 2025, 01:43 PM
రిటైర్డ్ అధికారికి కుచ్చుటోపి
నకిలీ ట్రేడింగ్ యాప్తో ఏకంగా 6.8 కోట్లు టోకరా
స్పైడర్, హైదరాబాద్ : నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్తో రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిని మోసగాళ్లు బురిడి కొట్టించారు. ఆయన నుంచి ఏకంగా రూ.6.8 కోట్లు దఫల వారీగా ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారా ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈకేసులో చెన్నై పోలీసులు కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. కృష్ణన్ కుమార్ కౌశల్ అనే ఐఎఫ్ ఎస్ అధికారి 2024లో రిటైర్డ్ అయ్యారు. అయితే నకిలీ పెట్టుబడి యాప్ల్లో ఆయన దఫాల వారీగా 6.8 కోట్లు పెట్టారు. యాప్లో షేర్ల విలువ రోజూ పెరుగుతుండగా.. స్టాక్ ఎక్స్ఛేంజ్లో మాత్రం తేడాలు కనిపించాయి. దీంతో కృష్ణన్ కుమార్కు అనుమానం కలగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల దర్యాప్తులో కేరళకు చెందిన శ్రీజిత్ ఆర్.నాయర్ , కోజికోడ్కు చెందిన అబ్దుల్సా, మలప్పురంకు చెందిన మహమ్మద్ ఫర్వాయిజ్ లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు.