Category: తాజా వార్తలు | 10 May 2025, 11:03 AM
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అవినీతి చేప
సంతకం చేసేందుకు రూ.60వేలు డిమాండ్
స్పైడర్, కరీంనగర్ : బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఫైల్పై సంతకం చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సిరిసిల్ల డివిజన్-7 ఇరిగేషన్ ఈఈ ఎర్రంరెడ్డి అమరేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని రూ.50లక్షల విలువ చేసే నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల ఫైల్పై సంతకం చేసేందుకు ఎర్రంరెడ్డి సదరు కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనలతో శనివారం ఉదయం ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డికి కాంట్రాక్టర్ 60వేలు లంచం ఇచ్చాడు.. లంచం తీసుకుంటున్న క్రమంలోనే తిరుపతిరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.