Category: తాజా వార్తలు | 02 May 2025, 03:24 PM
స్పైడర్, హైదరాబాద్ : ఫిల్మ్నగర్ భూముల కబ్జాపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఫిర్యాదు అందింది. షేక్పేట్ మండలం ఫిల్మ్నగర్లో దీన్ దయాళ్ నగర్లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. పలుమార్లు అధికారులను కంపౌండ్ వాల్ నిర్మాణం కోసం కోరినప్పటికీ స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని చింతల రామచంద్రారెడ్డి కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఆక్రమణలు నివారించేందుకు జీహెచ్ఎంసీ ల్యాండ్స్ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.