Category: తాజా వార్తలు | 06 Jun 2025, 08:56 PM
ఇక ఊరూరా సోనియమ్మ విగ్రహాలు ?
స్పైడర్, హైదరాబాద్ : సోనియా గాంధీ పుట్టిన రోజు లోపు 1000 విగ్రహాలను ప్రతిష్టించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్క విగ్రహానికి రూ .25 లక్షల చొప్పున రూ. 250 కోట్లకు ప్రైవేట్ టెండర్లు పిలిచే అవకాశం ? ఉందన్న వార్త కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. సోనియా గాంధీ విగ్రహాల పరిశీలకులుగా ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ కోదండరాంకు కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నది ఈ పోస్టుల సారాంశం. కాంస్యం లేదా పాలరాతితో విగ్రహాలు చేయించడానికి ముంబై నుంచి నిపుణుల బృందంతో చర్చలు జరుగుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన రోజుగా ప్రత్యేక కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం ? జరిగినట్లు, అదే రోజున " సోనియమ్మే మన తెలంగాణ అమ్మ " అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం. అయితే దీనిపై ప్రభుత్వం గాని, పార్టీ పెద్దలు గాని స్పందించాల్సి ఉంది.