ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

రాజ‌య్య‌ది మొస‌లి క‌న్నీరు..!
Share this post

Category: తాజా వార్త‌లు | 06 Jun 2025, 08:48 PM

రాజ‌య్య‌ది మొస‌లి క‌న్నీరు..!
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌ను జ‌నాలు న‌మ్మే ప‌రిస్థితిలో లేరు
స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి

స్పైడ‌ర్‌, వ‌రంగ‌ల్ : మాజీ ఎమ్మెల్యే రాజయ్యను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేర‌ని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్న రాజయ్య ను చూస్తుంటే జాలి వేస్తోంద‌ని స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గత పది ఏళ్ల కాలంలో ఏ ఒక్కరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కొత్తపల్లి గ్రామంలో కొందరికి ఇల్లు రా లేదని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి వారిని కలిసి రెచ్చగొడుతూ వారిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కొత్తపల్లి గ్రామంలో మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు 20 మందికి ఇచ్చామని రెండో విడతలో మిగతా వారికి అందిస్తామని తెలిపారు. ఐదుగురికి ఇల్లు రాలేదని వారితో కలిసి నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. గత పదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య అయిదుగురు వ్యక్తులు కనిపించలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వారికి ఇండ్లు లేవా గతంలో లేవా అనేది తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు . రాజయ్యకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఇల్లు రాలేదని అంటున్న ఐదుగురికి గతంలోనే డబల్ బెడ్ రూములు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. అప్పుడు గుర్తు రాని బాధితులు ఇప్పుడు గుర్తొస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదునం చేసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. గతంలో ఎమ్మెల్యేగా ఉండి ప్రతి పనిలో కమిషన్లు తీసుకున్న మీరు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించడం సరికాదని ఉన్నారు. అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న కడియం పనితీరును ఓర్వలేక అక్కసుతో రాజయ్య అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని ప్రజలు గమనిస్తున్నారని ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజయ్యను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే సలహాలు ఇవ్వాలని అంతేగాని అభివృద్ధి పనులను వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదన్నారు. మరో మారు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హిడ్మా తాజా చిత్రం లీక్‌... నేష‌న‌ల్ పార్కులోనే మ‌ట్టుబెట్టేస్తారా..?!
హిడ్మా తాజా చిత్రం లీక్‌... నేష‌న‌ల్ పార్కులోనే మ‌ట్టుబెట్టేస్తారా..?!
Read More
ఛీ వీళ్ల‌కు సిగ్గులేదు ..... ఓయో రూంలో దొరికిన మాజీ కౌన్సిల‌ర్లు..  మ‌హ‌బూబాబాద్‌లో ఘ‌ట‌న‌..పాడు ప‌నిచేస్తూ చిక్కిన ఇద్ద‌రు
ఛీ వీళ్ల‌కు సిగ్గులేదు ..... ఓయో రూంలో దొరికిన మాజీ కౌన్సిల‌ర్లు.. మ‌హ‌బూబాబాద్‌లో ఘ‌ట‌న‌..పాడు ప‌నిచేస్తూ చిక్కిన ఇద్ద‌రు
Read More
పిల్ల‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచాలి.. సోష‌ల్ మీడియా వారియ‌ర్ రాజ‌శేఖ‌ర్‌
పిల్ల‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచాలి.. సోష‌ల్ మీడియా వారియ‌ర్ రాజ‌శేఖ‌ర్‌
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.